ఎల్ ఓ సి చెక్కులు అందజేత

కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 15 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డి నియోజక ప్రజలకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అండగా నిలుస్తున్నారు.ఎల్లారెడ్డి నియోజక వర్గం రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన సిందుజ కు అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సిందుజ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 2,50,000/- రూపాయల ఎల్ఓసి చెక్కును మంగళవారం అందజేశారు.