ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 23 (లోకంతీరు) : ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఎస్.కె మోషి కుమారుడు రిజ్వాన్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండె శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. వారిది పేద కుటుంబం కావడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి తెలుపగా ఆయన 10000 పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించడం జరిగింది. ఈరోజు ఆ ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామా కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, జుంగల గణేష్, దండేవోయిన సాయి, కల్లెడ పురుషోత్తం, దండేవోయిన సాగర్, గపూర్, సలీం,సారంగీ గంగాధర్, మదస్తు చిన్నయ్య, పోచంపల్లి రంజిత్, పుల్లూరి గణేష్, మెరుగు రవీందర్, ఖలీం, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.