
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖానాపూర్, మే 27:
మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలుల బీభత్సానికి ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో బోగు నర్సయ్య, బోగు రవి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో కుటుంబ సభ్యులు గాయపడ్డారు.
ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్, 11వ వార్డు కౌన్సిలర్ రాజుర సత్యం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని, రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని రాజుర సత్యం హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మల రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్రె గంగాధర్, నాయకులు జమాల్ ఖురేషీ, జన్నారపు శంకర్, నాలుగో వార్డు ఇంచార్జి కస్తూరి మహేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Recover your password.
A password will be e-mailed to you.