కాలభైరవ స్వామి సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేత….
– జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి , జనవరి 26 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో కొలువుతీరిన దక్షిణ కాశీగా పేరొందిన పుణ్యక్షేత్రం ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామాల లో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయ చైర్మన్ ప్రభు స్వామి గుప్తా, అసిస్టెంట్ సురేందర్,లకు వారు చేస్తున్న కృషికి, భక్తులకు అందిస్తున్న సేవలకు గాను, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంస పత్రాలు స్వీకరించారు. తమ సేవా ప్రతిభను గుర్తించి ఈ ప్రశంస పత్రాలు అందించినందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి , జడ్పీ చైర్పర్సన్ శోభా రాజు లకు కృతజ్ఞతలు తెలిపారు.