Take a fresh look at your lifestyle.

భూమికి బదులు భూమి కల్పించండి…

0 1,610

కాల్వ కొరకు సంబంధించిన రైతుల భూముల రికార్డులను సవరించండి 

• ఎకరం భూమికి 30 లక్షల పరిహారం చెల్లించాలి

•  ప్రభుత్వా నిబంధనల ప్రకారం పరిహారం తో నష్టపోతున్నాం

•  గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ కి వినతి పత్రం అందజేత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సభకు వచ్చిన ఆర్డిఓ వై రంగనాథం ను కలిసి రైతులు తమ భూములు రికార్డులోకి ఎక్కించాలని విజ్ఞప్తి చేశారు. బొంపల్లి పెద్ద చెరువు ద్వారా లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి తమ గ్రామ రైతులకు అన్యాయం జరిగిందని వెంటనే రికార్డులను సరిచేయాలని మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు గతంలో 20 గుంటల భూమి కాలేశ్వరం కాల్వలకు పోతే 40 గుంటలు రికార్డు నుంచి తొలగించారని గత మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగిన ఎలాంటి ఫలితం దక్కలేదని వారు ఆరోపించారు. అదే భూములు ప్రభుత్వానికి అవసరమైతే రికార్డులు లేకున్నా తిరిగి రికార్డులకు ఎక్కించి రైతుల సమస్యలను తీర్చాలని అన్నారు. గ్రామ సభ లో గ్రామానికి చెందిన 29 మంది రైతులకు చెందిన భూములను రికార్డుల నుంచి రెండుసార్లు తొలగించారని దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలోని జిల్లా కలెక్టర్లకు విన్నవించామని అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తిరిగి తమ భూములను న్యాయంగా తమ పేరు రికార్డుకు ఎక్కించాలని రైతులు కోరారు. అందుకు స్పందించిన ఆర్టీవో మీరు ఇచ్చిన దరఖాస్తులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామసభలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి తొమ్మిది లక్షల 50 వేల 175 రూపాయలు ప్రభుత్వపరంగా నష్టపరిహారం వస్తదన్నారు. అయితే తమకు భూములకు బదులుగా భూములను కొనుగోలు చేసి ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు. లేదంటే ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఎకరాల 30 లక్షలు చెల్లించాలని రైతుల డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మార్వో గంగాసాగర్, ఇరిగేషన్ రెవిన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు. చట్ట ప్రకారం 9: 50 లక్షల కంటే ఎక్కువ ఇవ్వరాదని మీ డిమాండ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.

Leave A Reply

Your email address will not be published.