పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

కామారెడ్డి జిల్లా , జూలై 22 ( లోకంతీరు ) : నాగిరెడ్డిపేట్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు బదిలీ కాగా వారి స్థానంలో నూతన కార్యదర్శులు చేరారని సోమవారం ఎంపీడీవో పర్బన్న తెలిపారు. మండలంలోని అచ్చాయిపల్లి కార్యదర్శి రమ్యశ్రీ ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల కు బదిలీ కాగా, ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడి తండా కార్యదర్శి వెంకట్ రాములు. బొల్లారం కార్యదర్శి సంతోష్ కుమార్ లింగంపేట్ మండలం కోమటి పల్లి కి బదిలీ కాగా వారి స్థానంలో ఎల్లారెడ్డి మండలం మీసానిపల్లి కార్యదర్శి సంతోష్, మాల్తుమ్మెద కార్యదర్శి నర్సింలు.మద్నూర్ మండలం పెద్ద తడగూర్ కు బదిలీ కాగా స్థానంలో లింగంపేట్ మండలం భావానిపెట్ కార్యదర్శి అశోక్. మెల్లకుంట తండా కార్యదర్శి సవాయ్ మద్నూర్ మండలం డోంగ్లీ కి బదిలీ ఆ స్థానంలో ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ కార్యదర్శి పవిత్ర. జప్తి జానకంపల్లి కార్యదర్శి ప్రదీపకుమార్ ఎల్లారెడ్డి మండలం మత్తమాల కు బదిలీ కాగా ఆ స్థానంలో ఎల్లారెడ్డి మండలం బ్రహ్మాన్ పల్లి కార్యదర్శి శంకర్. పల్లె బోగుడతాండ కార్యదర్శి సునంద బదిలీపై ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్ కు బదిలీ కాగా,ఆ స్థానంలో అక్కడి నుండే సుజాత. రాఘవ పల్లి కార్యదర్శి కృష్ణ మూర్తి ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ కు బదిలీ కాగా ఆ
స్థానంలో గాంధారి మండలంలోని బ్రహ్మాన్ పల్లి కార్యదర్శి జానకి రాగా ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ లో ఉంది.వెంకంపల్లి కార్యదర్శి ప్రియాంక బదిలీ కాగా ఆ స్థానంలో లింగంపేట్ మండలం అయ్యపల్లి కార్యదర్శి రజిత ధర్మారెడ్డి కార్యదర్శి సత్యనారాయణ మెదక్ జిల్లాకు బదిలీ కాగా వారి స్థానంలో బంజారా కార్యదర్శి మమతకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గోలి లింగాల కార్యదర్శి గంగాధర్ మెడికల్ లీవ్ పై వెళ్లగా కార్యదర్శి తిరుపతి కి అదనపు బాధ్యతలు అప్పగించినట్టు ఎంపీడీవో పర్బన్న తెలిపారు. కాగా ఎంపీడీవో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ వెంకట్ రామ్ రెడ్డి బిచ్కుంద కు బదిలీ కాగా ఆ స్థానంలో మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రకాష్ చేరారని ఓఎస్ మానెమ్మ ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయానికి బదిలీ కాగ ఆ స్థానంలో అక్కడి నుండే వెంకటేశ్వర్లు ఇక్కడ చేరారని ఎంపీడీవో పర్బన్న తెలిపారు.