అధికారుల బదిలీలు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 23 ( లోకంతీరు ) : ముప్కాల్ ఎంపీవో భరత్ చంద్రతో పాటు మరో ముగ్గురు పంచాయతీ సెక్రటరీలు (నల్లూర్, కొత్తపల్లి, రెంజర్ల) బదిలీలపై మరొక చోటికి వెళ్లడం జరిగిందని ఎంపీడీవో మహమ్మద్ ముజాఫరోద్దీన్ మంగళవారం రోజు ఉదయం తెలిపారు.ముప్కాల్ ఎంపీవో భరత్ చంద్ర మెండోరా మండలానికి బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో రెంజల్ మండలంకు చెందిన ఎంపీవో మహమ్మద్ గౌస్ పదవి బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. కొత్తపల్లి పంచాయతీ సెక్రటరీగా ఎన్. రాజు, నల్లూర్ కె.విజ్ఞేష్, రెంజర్ల సెక్రటరీగా టీ.నగేష్ లు పదవీ బాధ్యతలు స్వీకరించారు.