శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 23 (లోకంతీరు ) : వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఆలయ పూజారి జంగమ గంగాధర్ తెలిపానారు.ఈ సందర్భంగా పూజారి జంగమ గంగాధర్ మాట్లాడుతూ, ఉదయం పల్లకి సేవ అనంతరం పంచామృత అభిషేకం భక్తులకు ప్రసాదు విత్తరణ అమ్మవారుకు గతవారం మెడలో వేసిన గాజులను మహిళలకు ఇవ్వడం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.