ఎల్లారెడ్డి శివారులో…..
గుర్తుతెలియని వ్యక్తులు చెరుకు తోట దగ్ధం

కామారెడ్డి జిల్లా /సదశివనగర్ ,ఫిబ్రవరి 1 ( లోకం తీరు ) : అడ్లూరు ఎల్లారెడ్డి శివారులోని పైడి నరేందర్ రెడ్డి చెరుకు తోటను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చాలావరకు పంట దగ్ధం అయింది. రైతు సుమారు రెండు లక్షల వరకు నష్టపోయనని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు.