ఎస్ ఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో వాటర్ ప్లాంట్ ప్రారంభం
– ప్రారంభించిన ఎస్ పి సింధు శర్మ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చి 11 ( లోకంతీరు ) : జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఎస్ అర్ ఫౌండేషన్ వారి సహకారంతో పోలీసు సిబ్బంది అవసరాల నిమిత్తం మినరల్ వాటర్ ప్లాంట్ ను సోమవారం ఎస్ పి సిందు శర్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు సిబ్బంది అవసరాల నిమిత్తం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఎస్ ఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంబించడ మైందన్నారు.
జిల్లా పోలీసు సిబ్బంది అందరూ ఈ వాటర్ ప్లాట్ ను సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ కాజోల్ సింగ్, అడిషనల్ ఎస్పి అడ్మిన్ కే. నరసింహారెడ్డి, డిఎస్పి నాగేశ్వరరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ జార్జ్ మరియు సీఐలు, ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు ఎస్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు