పలు విద్యాసంస్థలను సందర్శించిన జిల్లా విద్యా శాఖ అధికారి

మోర్తాడు, మార్చ్ 12 ( లోకంతీరు ) : మోర్తాడు మండల కేంద్రంలోని కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల ,బాలికల ప్రాథమిక పాఠశాల మరియు మండల విద్యా వనరుల కేంద్రాన్ని ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ దుర్గాప్రసాద్ గారు సందర్శించడం జరిగింది. ఈనెల 18వ తేదీ నుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంలో పదవ తరగతి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.ఇట్టి కార్యక్రమంలో మోర్తాడు మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య గారు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు