ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాల

బీబీపేట, మార్చి 13 ( లోకంతీరు) : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో ఇల్లు లేక చాయ్ హోటల్ నడుపుతూ ఉపాధి పొందే నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తించి ఇల్లు మంజూరు చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేయక వర్షా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. మండల కేంద్రానికి చెందిన అంబదాస్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య బీడీలు చేస్తూ పిల్లలు పాఠశాలకు వెళ్తూ అదే హోటల్ లో నివసిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే దయచూపి ఇల్లు మంజూరు చేయాలని కోరారు.