నియోజక వర్గ వ్యాప్తంగా నిర్వహించే బైక్ ర్యాలీకి తరలి వెళ్ళిన బిజెపి శ్రేణులు.

బాన్సువాడ/కోటగిరి, ఏప్రిల్ 20 ( లోకంతీరు ) :-జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే బైకు ర్యాలీకి పోతంగల్,కోటగిరి మండలాల నుండి బిజెపి కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు.ఈ సందర్భంగా వర్ని మండల కేంద్రంలో నిర్వహించే బిజెపి కార్యకర్తల సమావేశంలో ఉమ్మడి మండలాల బిజెపి శ్రేణులు పాల్గొననున్నారని తెలిపారు.