ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , జూలై 21 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన రమావత్ దేవ్లా శనివారం ఉదయం 11 గంటలకు తన పొలం పనులకు గేటివాల్ తిప్పుతుండగా అదే సమయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి కేజీవిల్ ట్రాక్టర్ తో పొలంలో పని చేస్తుండగా డ్రైవర్ వెనక్కి అజాగ్రత్తగా నడపడంతో దేవ్లాకి తలకి దెబ్బ తాకింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రమావత్ దేవ్లా కుమారుడు సేవ్యాకు ముదిరిచ్చా అంబియ ఫోన్ ద్వారా తెలుపగా కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దేవుల చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పై రమావత్ సేవియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చెస్తూన్నట్లు రాజంపేట ఎస్ఐ సంపత్ తెలిపారు.