ఎంపీ అరవింద్ కు వినతిపత్రం సమర్పించిన శివాజీ యూత్ అసోసియేషన్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి/ ముప్కాల్, ఆగస్టు 14 ( లోకంతీరు ) : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కి ముప్కాల్ శివాజీ యూత్ అసోసియేషన్ వినతి పత్రాన్ని సమర్పించారు. శివాజీ విగ్రహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతులు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ లో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ కమిటీ అధ్యక్షుడు లింగాపురం సాయరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకుడు సంతోష్, కిసాన్ కేత్ జిల్లా ఉపాధ్యక్షుడు ముసుకు నర్సయ్య, బీజేవైఎం ప్రెసిడెంటు దినేశ్, దాసరి నరేష్, రాహుల్, అరవింద్, జ్ఞానేశ్వర్, సతిష్, దీపక్ తదితరుల పాల్గోన్నారు