పాక్షికంగా దెబ్బతిన్న గృహాల పరిశీలన
– మండల తాసిల్దార్ కే. సువర్ణ

రామారెడ్డి, సెప్టెంబర్ 03 (లోకంతీరు) : మండల కేంద్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బ తిన్నా నివాసిత గృహాలను పరిశీలించిన తహసిల్దార్ కే సువర్ణ, ప్రస్తుతం సుమారు 20 కుటుంబాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అదేవిధంగా ముంపునకు గురైన బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి నిరాశ్రయం కల్పించడం జరిగిందని వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు.