బాధిత కుటుంబానికి అభయహస్తం సిండికేట్ ఆర్థిక సహాయం

కామారెడ్డి , నవంబర్ 4 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు తక్షణ సహాయంగా రామారెడ్డి మండల కేంద్రంలోని అభయ హస్తం సిండికేట్ ద్వారా మ్యాదరి సంతోష్ అకాల మరణాన్ని తెలుసుకున్న అభయ హస్తం సిండికేట్ సంఘ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి కుటుంబానికి సిండికేట్ ద్వారా 3000/- రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది.ఇలాగే ముందు ముందు మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆ యొక్క సంఘ నిర్వాహకులు తెలిపారు.