బాధిత కుటుంబలను పరామర్శించిన రాష్ట్ర కొ ఆపరేటీవ్ సొసైటీ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి


బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 25 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం లో పలు కుటుంబ సభ్యులను పరామర్శించారు.మెండోర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తింటి ముత్యం రెడ్డి వాళ్ళ అమ్మమ్మ చనిపోవడం వాళ్ల కుటుంబ సభ్యులులను,వన్నెల్ బి గ్రామానికి చెందిన విట్టల్ వాళ్ళ అన్న చనిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులను,
బాల్కొండ మాజీ సర్పంచ్ కాల శ్రీనివాస్ చనిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించరు,మొదటి సారి వన్నెల్ బీ వచ్చినందున పార్టీ కార్యాలయం లో సన్మానం చేసారు వా రి వెంట బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, వన్నెల్ బీ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఎల్లన్నగారి చిన్న దేవేందర్, గోజుర్ సంతోష్, గాదెపల్లి రాజు, మిట్టపల్లి సంతోష్ రెడ్డి,ఆర్మూర్ రాజు,లింబాద్రి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.