కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసిన
– ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

నిర్మల్, ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని ఢిల్లీలో బుధవారం నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కలిశారు, జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు,అదేవిధంగా నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరారు,ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించారు, ఎమ్మెల్యే వెంట నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, తదితరులు,ఉన్నారు.