కుకునూర్ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 27 ( లోకంతీరు ) : వేల్పూర్ మండలంలో కుకునూర్ ప్రాథమిక పాఠశాల శనివారం రోజున హెచ్ఎం వి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్ధిని విద్యార్థులతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలతో పాఠశాల నుండి వీధులలో ర్యాలీగా బయలుదేరి పోచమ్మ గుడికి చేరుకొని అమ్మవారి నైవేద్యం, సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా హెచ్ఎం హరి ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల తరఫున తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు పండుగలపై అవగాహనతో పాటు ప్రజలందరూ పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉంచుతూ అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి నరేందర్, నీరజ, తేజస్వి,రామకృష్ణ , విద్యార్ధిని ,విద్యార్థులు, గ్రమ ప్రజలు పాల్గొన్నారు.