అంగన్వాడి సెంటర్ లో పోషణ పక్వాడ

రామారెడ్డి, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఆయా కేంద్రాలలో సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్వైజర్ మాట్లాడుతూ పౌష్టికాహారం పిల్లలకు బలాన్ని చేకూరుస్తుందని, ప్రతిరోజు పిల్లలకు పాలు గుడ్లు తినిపించడం వల్ల పౌష్టికాహార లోపం లేకుండా ఎదుగుదల బాగుంటుందని, గర్భిణీ స్త్రీలు పాలు గుడ్లను సరైన సమయంలో తీసుకుంటూ, వైద్య సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో టీచర్ లు సుజాత, మాధవి, సూపర్వైజర్ జ్యోతి, ఆయా సెంటర్ల హెల్పర్లు, చిన్నపిల్లలు, చిన్నపిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.