డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమీటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రమేశ్వర్ పల్లి డబల్ బెడ్ రూమ్స్ అభివృద్ధి కమిటీనీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామేశ్వర్ పల్లి గ్రామంలోని డబల్ బెడ్రూమ్స్ లలో సమస్యలను తీర్చాలని ఆ వార్డు కౌన్సిలర్ సుతారి రవిని డబల్ బెడ్ రూమ్స్ ప్రజలు కలిశారు. అట్టి సమస్యలను పరిష్కరించేందుకు అందరు కలిసి ముందుకు వస్తే మీరు తెలిపే సమస్యలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మున్సిపల్ చైర్ మున్సిపల్ ఇందుప్రియ, జిల్లా పాలనాధికారి, మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.కౌన్సిలర్ సుతారి రవి ఆధ్వర్యంలో 2 బి హెచ్ కె రామేశ్వర్ పల్లి కమిటీ అధ్యక్షులుగా ఎం జి బ్రహ్మం, ఉపాధ్యక్షులుగా అనిల్, జనార్దన్, శంకర్, సంగి శ్యామ్,కార్యదర్శులుగా కిరణ్, సహాయ కార్యదర్శిలుగా. రామకృష్ణ, అవుసుల రవి, షేఖ్ షాదుల్లా,కోశాధికారులుగా శ్రీనివాస్, కిషన్, బాలాజీ, ప్రచార కన్వీనర్ గా ఆశన్న, కార్యదర్శులు కొత్తపల్లి సాయిలు, మోచ కిరణ్,సలహాదారులు బోదాస్ వెంకట రాజయ్య, మహ్మద్మొజిముద్దిన్,లింగం, డాక్టర్ గోపాల్, తిరుపతి రెడ్డి, కార్యవర్గ సభ్యులు మీరే శివ, ఎన్ సాయిలు, కే ప్రకాష్, అయ్యర్ శ్రీకాంత్,షేక్ సర్దార్, మోతే శ్రీనివాస్ గౌడ్,మహిళ విభాగంఅధ్యక్షురాలిగా వడ్ల సుమలత,ఉపాధ్యక్షురాలు గడ్డమీద ఉమలత ప్రధాన కార్యదర్శిగా కే పద్మ, సహాయ కార్యదర్శి కే రేఖ, కోశాధికారులుగా సుతారి సంగీత, హాసిన బేగం,సలహాదారులు మోలుగు వెంకటలక్ష్మి , లలిత, వరలక్ష్మి, కార్యవర్గ సభ్యులుగా ఎం వైష్ణవి, కిరణ్ బి నర్సవ్వ, టీ మేఘన, గంగని రాజ్యలక్ష్మి, ఎన్. దివ్య, ఎం అనిత, జి. లత, వడ్ల సాయవ్వ, ముమత్, లింగాపూర్ మంగమ్మ, రెండు కమిటీలకు గౌరవ అధ్యక్షులుగా వార్డు కౌన్సిలర్ సుతారి రవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.