తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది జీరో
– నేషనల్ కో ఆర్డీనేటర్ నీలం రమేష్

కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : భారత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని అల్ ఇండియా కిసాన్ సెల్ నేషనల్ కోఆర్డినేటర్ నీలం రమేష్ మీడియా సమావేశం లో పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగినవి.రూపాయి పంపిస్తే 43 పైసల బిచ్చం నుండి విముక్తి అని,మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని, రాష్ట్రంలో కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ ఐ డి విద్యాలయం లేదన్నారు. కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు.బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా ఇవ్వాలని,811టీ ఎం సి కృష్ణా జలాలలో సరైన వాటా ఇవ్వాలని,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ చేయాలన్నారు.