అక్రమ అరెస్టులను ఖండించండి
-పి డి ఎస్ యు

నిజామాబాద్ , జులై 24 ( లోకంతీరు ) : రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను విద్యారంగని కేటాయించాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్లతో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రిని నియమించాలని తదితర విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రశ్నిస్తే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కే అశుర్, ఎల్. అనిల్ కుమార్, కోశాధికారి నిఖిల్ లను ముందస్తుగా నోటీసులు ఇవ్వడం,అరెస్టు చేయడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తే, విద్యార్థి ఉద్యమాలను నిర్బంధించే ప్రయత్నం చేస్తే గత పాలకుల గతి పడుతుందని హెచ్చరించారు.