గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

బాల్కొండ నియోజకవర్గం ఫిబ్రవరి 03 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల కేంద్రం లో మెండోరా,నెహ్రూనగర్ గ్రామపంచాయతీ లకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించబడిన మెండోరా ఎంపీడీవో శ్రీనివాస్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో బద్దం అశోక్, రాజారెడ్డి, సాయరెడ్డి, గంగారెడ్డి, మౌలానా, గంగాధర్, డీసీ గంగయ్య, తదితరులు ఉన్నారు.