ఎస్సిలు అందరూ కలిసికట్టుగా ప్రభుత్వ ఫలాలు పొందాలి
కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : జిల్లాలోని మాచారెడ్డి మండలం భవానిపేట్ గ్రామ బేడ బుడగ జంగాలు కులస్తులతో కలిసి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడి, బుడగ జంగాల జనగణన సర్వే చేసి అందరూ కలిసికట్టుగా మనకు వచ్చే ప్రభుత్వ లబ్ధిలను మనమే పొందాలని రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్య పొరట సమితి రాష్ట్ర నాయకులు, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆనరాశి గిర్ని వెంకటి కోరారు.