కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశంలో ఎల్లారెడ్డి నియోజక వర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోమవారం పాల్గొన్నారు.పీసీసీ అధ్యక్షుడుగా నూతనంగా ఎంపికైన బి.మహేష్ కుమార్ గౌడ్ ను సీఎల్పీ తరపున సన్మానించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన పలు అంశాలపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చర్చించారు.